నదౌన్ లోని శ్రీ గురుద్వారా సాహిబ్ 10 వ పట్శాహి, 10 వ గురువుగారి గురుద్వారా, సిక్కుల ప్రధాన ధార్మిక కేంద్రం. ఇది బియాస్ నది ఒడ్డున ఉన్న చారిత్రక గురుద్వారా. ఈ గురుద్వారా ను పంజాబ్ లోని అమృతసర్ శిరోమణి గురుద్వారా నిర్వహణా సంస్థ వారు నిర్వహిస్తున్నారు.
యుద్ధంలో మోఘలులను ఓడి౦చిన తరువాత ఎనిమిది రోజుల పాటు 10 వ సిక్కుల గురువు బస చేసిన చోట ఈ మందిరాన్ని నిర్మించారు. ఆయన, 500 మంది సిక్కు సైనికులతో కలసి మొఘల్ నాయకుడు ఆల్ఫా ఖాన్ హుస్సేన్ పై పోరాడాడు. ఈ యుద్ధం 1891 ఏప్రిల్ 4 న జరిగింది. సిక్కుల పవిత్ర దస్సం గ్రంధ౦ లోని ‘నదౌన్ జంగ్’ లో గురు గోవింద్ సింగ్ ఈ యుద్ధాన్ని వర్ణించాడు.