నాగరహోళే పట్టణ సందర్శకులు నీలగిరి అడవులలో ఒక భాగమైన నాగరహోళే నేషనల్ పార్క్ ను కూడా తప్పక చూడాలి. దీనినే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. దేశంలోనే వన్య సంపదలకు పేరుగాంచిన ప్రదేశంగా ఇది చెప్పబడుతుంది. దీనిని 1955 సంవత్సరంలో స్ధాపించారు. దీనిలో అనేక జలపాతాలు, అందమైన లోయలు, చిన్న వాగులు, వంకలు ఎన్నో ఉంటాయి. నాగరహోళే నేషనల్ పార్క్ వివిధ రకాల మొక్కలకు, జంతువులకు ప్రసిద్ధి. నేటికి ఈ ప్రదేశంలో పులుల సంఖ్య గణనీయంగానే ఉంది. నేషనల్ పార్క్ సందర్శించే పర్యాటకులు దీనిలోని అడవి ఎలుగుబంట్లు, ఏనుగులు, చిరుతలు, నాలుగు కొమ్ముల దుప్పులు, అడవి దున్నలు కోతులు, కొండముచ్చులు, ఎగిరే నక్కలు, పులులు, ఇతర జంతువులను, కొండచిలువలు, నాగుపాములు, మొసళ్ళు వంటి వాటిని చూడవచ్చు. పక్షులను గమనించేవారికి నాగర్ హోళే నేషనల్ పార్క్ ఒక స్వర్గంగా ఉంటుంది.