సమయం అనుకూలిస్తే పర్యాటకులు నాగరహోళే కు సన్నిహితంగా లక్ష్మణ తీర్ధ నది ఒడ్డున పారుతున్న రామేశ్వర దేవాలయాన్ని తప్పక సందర్శించాలి. దీని చుట్టూ చక్కటి వరి పొలాలు కనపడతాయి. ఇవి ఒక దట్టమైన అడవి ద్వారా సమీపంలోని కొన్ని జలపాతాలకు దోవతీస్తాయి. ఈ దేవాలయంలో శివ భగవానుడి విగ్రహం కలదు. వేలాది భక్తులు మహాశివరాత్రి నాడు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. స్ధానిక ప్రజల నమ్మకాల మేరకు, భక్తులు తాము చేసిన తప్పులను, పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే రామేశ్వర దేవాలయంలో అర్చనలు చేయించాలని చెపుతారు. సీతారాముల దాహార్తిని తీర్చేటందుకు లక్ష్మణుడు బ్రహ్మగిరి సమీపంలో తన బాణంవేయగా బ్రహ్మగిరి వద్ద ఆ బాణం వేసిన ప్రదేశంలో భూమినుండి పైకి వచ్చి లక్ష్మణ తీర్ధ అనే పేరుతో ఒక పవిత్ర నదిగా ప్రవహిస్తోందని చెపుతారు.