నాగార్జునకొండ ఒక పురాతన బౌద్ధ ద్వీప నగరం. ఇది ఆంధ్రప్రదేశ్ నల్గొండ జిల్లాలో ఒక భాగంగా ఉన్నది. ఈ పట్టణం నాగార్జునసాగరుకి చాలా సమీపంలో ఉన్నది మరియు హైదరాబాదుకి 150 కి. మీ. దూరంలో ఉన్నది.
ఈ ద్వీప పట్టణం 1960లొ రూపు దిద్దుకొన్నది. ఎందుకనగా నాగార్జునసాగర్ డాం కడుతున్నప్పుడు కొండ మునిగిపోయింది. ఈ పట్టణం భారత దేశం యొక్క ప్రసిద్ధి చెందిన ఒక బౌద్ధ స్థలంగా పేరు పొందింది మరియు ఇక్కడికి దేశ విదేశాలనుండి సందర్శకులు వస్తుంటారు. పురాతన కాలంలో నీటిలో మునిగిన కొండను శ్రీ పర్వత అని పిలుస్తుండేవారు.
ఈ ద్వీపానికి బౌద్ధ మత ప్రచారకుడు,బౌద్ధ సన్యాసి అయిన నాగార్జునుడిని గౌరవిస్తూ నాగార్జునకొండ అని పేరు పెట్టారు. ఈ పట్టణం బుద్ధుడు ఉన్నప్పుడు, తరువాత కూడా ఒక అధ్యయన కేంద్రంగా నిరూపించపడింది. ఇక్కడ చాల బౌద్ధ ఆరామాలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మరియు వీటిలో విద్యను అభ్యసించటానికి విద్యార్థులు దూరప్రాంతాలనుండి కూడా వస్తారు.