నాగార్జునసాగర్ డాం ప్రారంభించేనాటికి అది ప్రపంచంలోకల్లా ఇటుక,రాతితో నిర్మించబడ్డ పెద్ద ఆనకట్ట. ఆంధ్ర ప్రదేశ్ నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగరు పట్టణానికి సమీపంలో ఈ ఆనకట్ట ఉన్నది.
నాగార్జునసాగర్ ఆనకట్ట కృష్ణ నది మీద నిర్మించబడింది. ఆనకట్ట మీద ప్రాజెక్ట్ వర్క్ 1955 లో ప్రారంభమైంది మరియు 1967 లో ముగిసింది. ఈ ఆనకట్ట 11.472 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి రిజర్వాయర్ సృష్టించడానికి సామర్థ్యం కలిగి ఉంది. ఇది 490 అడుగుల ఎత్తు ఉండి మరియు 1.6 కిలోమీటర్ల పొడవు ఉండి, సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఇది 42 అడుగుల వెడల్పు మరియు 45 అడుగుల పొడవు కొలత గల మొత్తం 26 గేట్లు కలిగి ఉంది.
ఈ ఆనకట్ట భారత దేశ చరిత్రలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది దేశంలో మొట్టమొదటి హరిత విప్లవాన్ని తెచ్చింది. నీటి పారుదల కోసం మరియు జలవిద్యుత్తును పరిసర ప్రాంతాలకు అందిచటం కోసం కట్టబడిన మొట్టమొదటి ఆనకట్ట.