రాజస్తాన్లోని నాగౌర్ నగరంలో ఉన్న టర్కీన్ దర్గా ప్రధాన ధార్మిక కేంద్రం. అజ్మీర్-ఇ-షరీఫ్ దర్గా తరువాత ముస్లిం లలో అపారమైన ధార్మికతకు చిహ్నంగా ఈ దర్గాను భావిస్తారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి ప్రధాన శిష్యులలో ఒకడైన ఖ్వాజా హమిదుద్దిన్ నాగౌరి కి గుర్తుగా టర్కీన్ దర్గా ను నిర్మించారు. ఈ దర్గా ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఖ్వాజా హమిదుద్దిన్ నాగౌర్ సమాధి మీద నిర్మించారని చెప్తారు.