నాగూరు తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో ఉన్న ఒక నగరం. ఈ నగరం బంగాళాఖాతంనకు దగ్గరలో ఉన్నది. దీనికి ఉత్తరంగా 4 కిమీ దూరంలో నాగపట్నం ఉన్నది. దక్షిణాన 16 కిమీ దూరంలో కారైకాల్ ఉన్నది. ఈ ప్రదేశంను చైనీస్ పర్యాటకుడు హిఉఎన్ త్సాంగ్ రాసిన పుస్తకంలో బుద్ధ విహార్ గా పేర్కొనెను. నాగూరును 690-728 AD లో పల్లవ రాజు రాజసింహ పాలించెను.
నాగూరు మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు
నగరం యొక్క ప్రధాన ఆకర్షణగా ప్రసిద్ధి చెందిన నాగూరు దర్గా ఉంది. ఈ దర్గా కారణంగా నాగూరు ఒక పుణ్యక్షేత్ర గమ్యస్థానంగా గుర్తించబడింది. ఈ ఇస్లామిక్ ఆలయం మీరన్ సాహిబ్ అబ్దుల్ కదిర్ శాహుల్ హమీద్ బాద్షా కు అంకితం చేయబడింది. నాగూరులో ఎజ్హు లేబ్బై జామియా మసీదు,ఫాతిమా జామియా మసీదు మరియు తీరు పల్లి మసీదు ప్రసిద్ది చెందిన మసీదులుగా ఉన్నాయి. నగరం యొక్క మరొక ఆకర్షణగా సీరలమ్మన్ ఆలయం ఉన్నది. ఇది నగోరేపట్టినచేర్రి విలేజ్ (ఒక మత్స్యకార గ్రామం) లో ఉన్నది. అంతేకాక నాగూరు రైలు స్టేషన్ చాలా దగ్గరగా ఉంది.
ప్రతి సంవత్సరం సీరలమ్మన్ పండుగను ఆలయంలో 10 రోజులు జరుపుకుంటారు. నాగూరులో ప్రతి సంవత్సరం అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో జరిగే కందూరి వేడుకలో ప్రయాణికులు పాల్గొనవచ్చు. నగరంలో మారియమ్మన్ దేవాలయం,ఆంజనేయ స్వామి ఆలయం,శివుని గుడి మరియు పెరుమాళ్ కోయిల్ వంటి ఇతర సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.
నగరంలో ఆలయాలు,మసీదులు మరియు పుణ్యక్షేత్రాలే కాకుండా బాగా పర్యాటక మరియు స్పోర్ట్స్ కార్యకలాపాలకు ప్రసిద్ధిచెందిన ఒక బీచ్ ఉంది. దేశం మొత్తంలో ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి అన్ని మతాలకు చెందిన పర్యాటకులు నాగూరును సందర్శించడానికి వస్తారు.
నాగూరు చేరుకోవడం ఎలా
నాగూరు రైలు,విమాన మరియు రోడ్డు మార్గాల ద్వారా తమిళనాడులోని నగరాలకు అనుసంధానం చేయబడింది. నగరంనకు చెన్నై మరియు తిరుచ్చితో నిత్యకృత్యంగా ఒక రైల్వే జంక్షన్ ఉంది. నాగూరు దగ్గరగా ఉండే విమానాశ్రయాలు చెన్నై మరియు తిరుచ్చి విమానాశ్రయాలుగా ఉన్నాయి.
నాగూరు వాతావరణము
ఈ నగరం సముద్రమునకు చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇది తీర ప్రాంత వాతావరణాన్ని కలిగి ఉంటుంది.