దౌలా ఖాన్ పర్యాటక ప్రదేశం పవొంత సాహిబ్ రోడ్ లో కలదు. ఈ ప్రదేశం లో అనేక మామిడి, నిమ్మ చెట్ల తోటలు కలవు. ఇక్కడే ఒక పండ్ల రసాలు తయారు చేసే ఫ్యాక్టరీ కూడా కలదు. ఇది మేలైన రసాలు, పచ్చళ్ళు , జాములు, డబ్బాల పండ్ల రసాలు తయారు చేస్తుంది.
దౌలా ఖాన్ లో దీనితో పాటు హిమాచల్ ప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా కలదు. ఇది పండ్ల పెంపకం పై పరిశోధన చేస్తుంది. కతసాన్ దేవి గుడి కూడా సమీపం లో కలదు. ఈ గుడి రాజా జగత్ సింగ్ తన శత్రువు రూలం కాదిర్ రోహిల్ల తో పోరాడిన ప్రదేశంలో నిర్మించారు.