సుకేటి ఫాస్సిల్ పార్క్ ఒక పర్యాటక ఆకర్షణ. నహాన్ కు 25 కి. మీ.ల దూరం మాత్రమే వుండటం చేత పర్యాటకులు తేలికగా చేరవచ్చు. ఈ పార్క్ ను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మరియు సర్వేఆఫ్ ఇండియా కలసి నిర్మించారు. దీని నిర్వహణ చాలా బాగుంటుంది. ఆసియ ఖండంలో మొదటగా ఈ పార్క్ లోనే పురాతన కాల జంతు శరీర అవశేషాలు లభించాయి. చాలా మంది విద్యార్ధులు, స్కాలర్ లు ఈ పార్క్ ను తమ రీసెర్చ్ వర్క్కు ఉపయోగిస్తారు. పార్క్ లో ప్రీ హిస్టారిక్ జంతువుల పెద్ద బొమ్మలను ప్రదర్శించటం చూడవచ్చు.
ప్రశాంతమైన మార్కండ నది ఒడ్డున కల ఈ పార్క్ లో ఆరు సెట్ల లైఫ్ సైజు విగ్రహాలు ఎనుగులవి, తాబేళ్లు, పులులు, నీటి ఏనుగులు, మొసళ్ళు వంటివి కలవు. ఈ జంతువుల కళేబరాలు, మరియు అస్థిపంజరాలు పురావస్తు వారిచే కనుగొనబడి అతి జాగ్రత్తగా సంరక్షించ బడుతున్నాయి. ఈ ప్రదేశం హిమాలయాల లోని శివాలిక్ కొండల మధ్యన, మరియు పై భాగాలలో ఇసుక రాతి మరియు మట్టి రాళ్ళ లోను కలదు.