నహాన్ కు సమీపం లో త్రిలోక్ పూర్ టవున్ లో త్రిలోక్ పూర్ టెంపుల్ కలదు. ఈ గుడి నహాన్ నుండి 23 కి. మీ.లు మరియు కలకా - అంబాలా రహదారి నుండి 6 కి. మీ.లు వుంటుంది. ఈ టెంపుల్ ను రాజా దీప ప్రకాష్ 1573 లో నిర్మించారు. ఈ టెంపుల్ లో మహామాయా బాల సుందరి దైవం. హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తర భారత ప్రాంతాల నుండి అనేక మంది భక్తులను ఈ గుడి ఆకర్షిస్తుంది.
నవరాత్రులలో, అంటే ఏప్రిల్ మరియు అక్టోబర్ లలో టెంపుల్ ఆవరణ లో జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో అనేకమంది భక్తులు మాత మహామాయ బాలసుందరి ని పూజిస్తారు భారతీయ పురాణాల మేరకు ఈ మాత చాల శక్తి వంతమైనదని,మహిమలు కలదని భావిస్తారు.