భారత దేశపు సరస్సుల జిల్లా గా పిలువబడే నైనిటాల్ హిమాలయ శ్రేణులలో కలదు. అది కుమావొన్ హిల్స్ మధ్య భాగం లో వుంది అందమైన సరస్సులు కలిగి వుంది. నైనిటాల్ ను స్కంద పురాణం లోని మానస ఖండ్ లో ముగ్గురు ఋషుల సరస్సు లేదా ముగ్గురు ఋషుల సరోవరం అని కూడా అంటారు. ఈ ముగ్గురు ఋషుల పేర్లు అత్రి, పులస్త్య, మరియు పులాహ.వీరు వారి దాహం తీర్చుకునేతందుకు గాను నైనిటాల్ వద్ద ఆగారు. వారికి ఆ ప్రాంతం లో నీరు దొరక లేదు.వెంటనే వారు ఒక పెద్ద గొయ్యి తవ్వి దానిలోకి మానస సరోవరం నీటిని నింపి దాహం తీర్చుకున్నారు. ఆ విధంగా నైనిటాల్ సరస్సు సృష్టించబడింది. మరో కధనం ప్రకారం ఇక్కడ శివుడి భార్య అయిన సతి యొక్క ఎడమ కన్ను పడి ఆ ప్రాంతంలో నైని సరస్సు సృష్టించబడింది.
నైనిటాల్ దాని అందాలకు ప్రశాంత వాతావరణానికి గాను టూరిస్టులకు స్వర్గం గా వుంటుంది. బ్రిటిష్ వ్యాపారి ఫై. బర్రోన్ అనే వ్యక్తి ప్రాంత అందాలకు ముగ్ధుడై 1839 సంవత్సరం లో ఇక్కడ ఒక బ్రిటిష్ కాలనీ స్థాపించి దానిని ప్రసిద్ధి చేసాడు. నైనిటాల్ సందర్శనకు ప్రణాళిక చేసే వారు ఇక్కడే కల హనుమాన్ ఘర్ కూడా తప్పక చూడాలి. దీనితో పాటు ఇండియా లోని 51 శక్తి పీటా లలో ఒకటి అయిన నైనా దేవి టెంపుల్ కూడా తప్పక చూడాలి. నైనిటాల్ నుండి 10 కి.మీ. ల దూరంలో కల అందమైన పిక్నిక్ ప్రదేశం కిల్ బరీ కూడా చూడదగినది. పచ్చటి ఓక్,పైన్ మరియు రోడోడెండ్రాన్ అడవులు ఈ ప్రాంతాన్ని ఒక చక్కటి విశ్రాంతి ప్రదేశంగా చేసాయి. ఈ అడవులలో సుమారు 580 జాతుల కు పైగా వివిధ రకాల వృక్ష జాతులు, రంగు రంగుల పక్షులు కలవు. సముద్ర మట్టానికి 2481 అడుగుల ఎత్తున కల లరిఅకంత పర్యాటకులకు ఎన్నో అందమైన హిమాలయ దృశ్యాలు చూపుతుంది. ఇది నైనిటాల్ లో రెండవ అత్యధిక ఎత్తు కలది.
లాండ్స్ ఎండ్ ప్రదేశం ఖుర్పతాల్ లేక్ యొక్క అందమైన దృశ్యాలు చూపి ముగ్దులును చేస్తుంది. ఇది పచ్చటి వాలీ మరియు నైనిటాల్ చుట్టూ వున్నా కొండల అందాలు కూడా చూపుతుంది. టూరిస్టులు ఒక రోప్ వే ద్వారా ఈప్రదేశ కొండప్రాంతాలను చేరవచ్చు. ఈ రోప్ వే సుమారు 705 మీటర్ల దూరం కవర్ చేస్తుంది. ప్రతి కేబుల్ కార్ కూడా గరిష్టంగా 12 మంది వ్యక్తులను మోయ గలదు. రోప్ వే ద్వారా స్నో వ్యూ తేలికగా చేరవచ్చు.స్నో వ్యూ నుండి హిమాలయాల అందాలు అద్భుతంగా కనపడతాయి. నైనా శిఖరాని చైనా శిఖరం అని కూడా అంటారు. ఇది నైనిటాల్ లో ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 2611 మీ. ల ఎత్తున కలదు. దీనిని చేరాలంటే, గుర్రం పై వెళ్ళాలి.టిఫిన్ టాప్ లేదా డొరొతి సీట్ అనేది ఒక పిక్నిక్ ప్రదేశం ఇక్కడ టూరిస్టులు ఎంతో వినోదం తో సమయం గడపవచ్చు. ఈప్రదేశం డొరొతి కేల్లేట్ అనే ఒక ఇంగ్లీష్ ఆర్టిస్ట్ భార్య పేరుతో అభివృద్ధి చేయబడింది. ఈమె ఒక ప్లేన్ ఆక్సిడెంట్ లో మరణించగా ఆమె పేరుతో ప్రదేశం అభివృద్ధి చేయబడింది. ఇక్కడే ఒక ఈకో కేవ్ గార్డెన్ కలదు. ఇది మరొక పేరొందిన ప్రధాన ఆకర్షణ. ఈప్రదేశం సందర్శకులకు పర్యావరణ స్నేహ పూరిత జీవన విధానాలు నేర్పిస్తుంది.
నైనిటాల్ లో రాజ్ భవన్, జూ, ది ఫ్లట్ట్స్, ది మాల్, సెయింట్ జాన్ ఇన్ ది విల్దెర్నెస్స్ చర్చి, పాన్గోట్ లు ఇతర ప్రధాన ఆకర్షణలు. టండి సడక్, గుర్నీ హౌస్, ఖుర్పతాల్, గుఅనో హిల్స్, మరియు అరబిందో ఆశ్రమం వంటి ప్రదేశాలు కూడా తప్పక చూడదగినవే. ఇంతేకాక , టూరిస్టులు ఇక్కడ హార్స్ రైడింగ్, ట్రెక్కింగ్, బోటింగ్ వంటి వినోదాలలో కూడా ఆనందించవచ్చు. నైనిటాల్ ను రోడ్, రైల్ మరియు ఎయిర్ మార్గాలలో దేశం లోని వివిధ ప్రాంతాల నుండి చేరవచ్చు. అందమైన ఈ ప్రదేశాన్ని అందరూ వేసవులలో సందర్శించేందుకు ఇష్టపడతారు.