నమక్కల్ దుర్గం కోటను 16 వ శతాబ్దంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు. ఇది నామగిరి కొండలపై కలదు. ఈ కోట ఇపుడు పురాతన విష్ణు టెంపుల్ శిధిలాలు కలిగి వుంది. నమక్కల్ దుర్గం కోట సుమారు ఒకటిన్నర ఎకరం వరకూ వుంటుంది. కోటకు నైరుతి భాగంలో మెట్లు కలవు. నామ గిరి హిల్స్ కు ఇరువైపులా నరసింహస్వామి మరియు రంగనాథ స్వామిల కొండ గుహ టెంపుల్స్ కలవు.
కొండ రాతితో చెక్కబడిన విగ్రహాలు కావటం వలన నేటికి అవి చెక్కు చెదరకుండా వున్నాయి. ఈ కొండలలో ఎనిమిది పవిత్ర కొలనులు కలవు. వీటిలో తామర పూవులు పెరుగుతాయి. ఈ ఫోర్ట్ లో కొంత కాలం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి కనపడకుండా తలదాచుకొన్నాడు. తర్వాతి కాలంలో ఈ కోటను బ్రిటిష్ వారు వశం చేసుకున్నారు. ఇక్కడ కల చారిత్రక, శిల్ప కళ ఈ ప్రదేశాన్ని సందర్శించే లా చేస్తాయి.