ఆసక్తి కరమైన చరిత్ర వున్న చార్ ధామ్ సిక్కిం లోని ప్రసిద్ద తీర్థ యాత్రా స్థలం. ఇక్కడి ప్రధాన దైవం మహాశివుడు. చార్ ధామ్ నామ్చి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సోలోఫోక్ పర్వతాల వద్ద వుంది. కౌరవ పాండవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడు ఈ ప్రాంతంలోనే పరమశివుడి గురించి తపస్సు చేసాడు. అందుకు సంతోషించి శివుడు అర్జునుడి ముందు కిరాతుడిగా కనిపించి అతన్ని దీవించాడు, దీనివల్ల యుద్ధంలో పాండవులు గెలిచారని భావిస్తారు.
చార్ ధామ్ 7 ఎకరాల విస్తీర్ణంలో వుంటుంది. ఇక్కడ 16 అడుగుల ఎత్తున్న పరమశివుడి భారీ విగ్రహం వుంది. రామేశ్వరం ప్రతీకగా నిర్మించిన శివాలయంలో శివలింగం వుండగా, చార్ ధామ్ సముదాయంలో విష్ణు భగవానుని విగ్రహాలున్న బద్రీ నాథ్, జగన్నాథ్, ద్వారక ల ప్రతిరూపాలు కూడా వున్నాయి.
ఈ ఆలయ ప్రాంగణం 4 భాగాలుగా విభజించారు – 12 జ్యోతిర్లింగాలతో పాటు శివుడి విగ్రహం, నాలుగు ధామ్ లు, సాయి బాబా మందిరం, కిరాతేశ్వర విగ్రహం, నంది విగ్రహం కూడా వున్నాయి.