సిక్కులకు గల అయిదు అధికారిక పీఠాలలో హజూర్ సాహిబ్ గురుద్వార ఒకటి. ఇది నాందేడ్ లో గోదావరి నది ఒడ్డున కలదు. చక్కగా నిర్వహించబడే ఈ పుణ్యక్షేత్రం సిక్కుల ఉత్తమ శిల్పశైలిని, మతపర విధానాలను ప్రతిబింబిస్తుంది. యుద్ధపు ఆయుధాలను పవిత్ర నీటితో శుభ్రం చేసే ఉదయం వేళ ప్రార్ధనలు తప్పక చూడాలి. వీరి హావ భావాలు, ఉద్రేకాలు అత్యధిక స్ధాయిలో ఉండే ఈ సమయం చూచేందుకు ఎంతో బాగుంటుంది.