నంది హిల్స్ దర్శించే పర్యాటకులు 600 మీటర్ల ఎత్తున్న టిప్పూస్ డ్రాప్ అనే చిన్న కొండ భాగాన్ని చూస్తారు. చారిత్ర వాస్తవాల మేరకు ఈ కొండ అంచు ఖైదీలను శిక్షించేదిగా చెపుతారు. మరణ శిక్ష పడ్డ ఖైదీలు ఈ కొండపైనుండి క్రిందకు నెట్టివేయబడేవారు. ఈ ప్రదేశం నంది హిల్స్ పై...
నంది హిల్స్ లో నంది దేవాలయం తప్పక దర్శించదగినది. దీనిని విజయనగర సామ్రాజ్య కాలంనాడు కెంపే గౌడా పాలనలో నిర్మించారు. ఈ యాత్రా స్ధలం నంది హిల్స్ దిగువ భాగంలో ఉండి యాత్రికులచే ఎంతో పవిత్ర స్ధలంగా పేర్కొనబడుతుంది. యోగనందీశ్వర మరియు భోగ నందీశ్వర విగ్రహాలు ఈ దేవాలయంలో...
ఈ ప్రాంతంలో బ్రహ్మాశ్రమం కూడా యాత్రికులు చూడవలసిన ప్రధాన క్షేత్రాలలో ఒకటి. వాస్తవానికి ఇది ఒక గుహ. సహజ రాళ్ళతో ఏర్పడినది. ఒకప్పుడు మత గురువులు రామక్రిష్ణ పరమహంస ఇక్కడ కూర్చొని కాళీ మాతను పూజించేవారని చెపుతారు. మతపర ప్రాధాన్యత కారణంగా, దాని సహజ నిర్మాణం...
నంది హిల్స్ దర్శించేవారు యోగ నందీశ్వర దేవాలయాన్ని తప్పక చూడాలి. ఇది చోళులచే నిర్మించబడింది. ఈ ప్రాంతంలో శివ భగవానుడి పేరుతో ఇదే ఒక పవిత్ర ప్రదేశంగా చెప్పబడుతుంది. ఈ దేవాలయంలో అందమైన డిజైన్లు, శిల్పాలు గోడలకుంటాయి. ఆకర్షణీయ కళ్యాణ మంటపం కూడా ఉంటుంది. ఈ దేవాలయ...
ఎల్లపుడూ పారే సరస్సు అమృత సరోవర్ ను పర్యాటకులు తప్పక చూడాలి. దీనినే లేక్ ఆఫ్ ఎంబ్రోసియా లేదా లేక్ ఆఫ్ నెక్టార్ లేదా తేనె సరస్సు అని కూడా అంటారు. ఈ నీటి సరస్సు ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రదేశానికి నీటి సరఫరా దీనినుండే జరుగుతుంది. ఈ సరస్సులో నీరు సంవత్సరం పొడవునా...
నందిహిల్స్ పర్యాటకులు బ్రిటీష్ శిల్ఫశైలి కల నెహ్రరూ నిలయాన్ని తప్పక చూడాలి. ఈ బంగళా పేరు భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట పెట్టారు. ఆయన ఈ ప్రదేశంలో కొంత సమయం గడిపారు. అప్పటి మైసూర్ కమీషనర్ సర్ మార్క్ కబ్బన్ కెసిబి కూడా వేసవిలో ఈ బంగళాలో గడిపేవాడు....
నంది హిల్స్ కు వచ్చే పర్యాటకులు గాంధీ హౌస్ తప్పక చూడాలి. ఇది ఒకప్పుడు మహాత్మ గాంధీ నివాసంగా ఉండేది. కర్నాటక ప్రభుత్వం ప్రస్తుతం దీని నిర్వహణా భాధ్యత వహిస్తోంది. ప్రముఖ వ్యక్తులకు మాత్రమే దీనిలో వసతి కల్పిస్తారు.
నంది హిల్స్ పై భాగాన ఉన్న గావి వీరభద్ర స్వామి దేవాలయం కూడా దర్శించదగినదే. ఇది టిప్పు ప్యాలెస్ నుండి సుల్తాన్ పేట వెళ్ళే మార్గంలో ఉంది. ఈ యాత్రా కట్టడం కూడా సహజమైన కొండరాళ్ళతో నిర్మించబడి అందంగా ఉంటుంది.
నంది పట్టణం నుండి 7 కిలోమీటర్ల దూరంలో కల కనివే నారాయణపుర పట్టణాన్ని పర్యాటకులు తప్పక చూడాలి. ఇక్కడి అందమైన కొండలు, అంటే స్కందగిరి, బ్రహ్మగిరి, నంది హిల్స్, చన్న గిరి పర్యాటకులను ఆనందపరుస్తాయి. పరిశుభ్రత, శుభ్రమైన నీరు, వంటివి కనివేనారాయణపురలో సత్య సాయి బాబా...
నంది హిల్స్ పర్యాటకులు కొండపై కల శ్రీ యోగ నరసింహ మరియు శ్రీ ఉగ్ర నరసింహ దేవాలయాలు తప్పక చూడాలి. కొండపై భాగన కల శ్రీ భోగ నరసింహ దేవాలయం పర్యాటకులకు మరో యాత్రా స్ధలంగా ఉంటుంది.
నంది హిల్స్ పర్యాటకులు టిప్పు సుల్తాన్ వేసవి విడిదిని, కోటను తప్పక చూడాలి. ఇది సుమారు 90 ఎకరాలలో ఉంది. సముద్ర మట్టానికి 4,851 అడుగుల ఎత్తున కలదు. కోట శ్రీరంగపట్నంలోని దరియా దౌలత్ నమూనాలో ఉంటుంది. టిప్పు సుల్తాన్ కోట నిర్మాణం చిక్కబల్లపూర్ నేతలు...