నంజన్ గూడ్ పర్యాటకులు నంజుండేశ్వర దేవాలయాన్ని తప్పక చూడాలి దీనినే శ్రీ కంఠేశ్వర అని కూడా అంటారు. ఇక్కడి దేవుడు శివుడు. ఈ దేవాలయం ద్రవిడ శైలి శిల్పాలతో ఉంటుంది. ఇతిహాసాల మేరకు ఈ దేవాలయం ప్రాచీన కాలంనుండి శివ భగవానుడి నివాసంగా ఉందని చెపుతారు. ఈ దేవాలయం గంగ పాలకులు చే నిర్మించబడింది. హొయసల రాజులచే పునరుద్ధరించబడింది. టిప్పు సుల్తాన్ మరియు హైదర్ అలి లు దీనితో మంచి అనుబంధం కలిగి ఉండేవారు. చరిత్రకారుల మేరకు ఈ దేవాలయ దేముడు నంజుండకు ప్రార్ధన చేసిన వెంటనే టిప్పు సుల్తాన్ కు ఎంతో ప్రియమైన ఏనుగు తన జబ్బులనుండి వెంటనే నివారణ పొందిందని చెపుతారు. ఆ విధంగా ఈ దేవాలయానికి జబ్బులను నివారించే శక్తి లేదా మహిమలు ఉన్నాయని చెపుతారు. సంవత్సరానికి రెండు సార్లు జరిగే రధోత్సవ సమయంలో యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు. దీనిని దొడ్డ జాతర అంటారు. రధాలలో గణపతి, పార్వతి, శ్రీకంఠేశ్వర, సుబ్రహ్మణ్య మరియు చండికేశ్వర విగ్రహాలను పెట్టి ఊరేగిస్తారు.