నంజన్ గూడ్ పర్యాటకులు పరశురామ క్షేత్రాన్ని కూడా తప్పక చూడాలి. ఈ ప్రదేశంలో కపిల మరియు కౌండిన్య నదులు కలుస్తాయి. పరశురాముడు తన తల్లిని నరికి చంపినందుకుగాను ఈ నదీ సంగమంలో ప్రక్షాళన పొంది పాపాన్ని పోగొట్టుకున్నాడని చెపుతారు. శివుడు ఆజ్ఞ మేరకు పరశురాముడు అక్కడే దేవాలయాన్ని నిర్మించి తపస్సు చేసుకుంటున్నాడని చెపుతారు.