నరకంద హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక అందమైన పర్యాటక కేంద్రం. మంచుతో కప్పబడిన మహోన్నత హిమాలయ పర్వత శ్రేణులు మరియు పర్వతదాల వద్ద ఉన్న హరిత వనాల యొక్క అద్భుత వీక్షణను నరకంద మనకందిస్తుంది. హిందూస్తాన్-టిబెట్ రహదారిలో, 2708 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం, భారతదేశం యొక్క ప్రసిద్ధ పర్వతప్రాంత పట్టణాలలో ఒకటి.
నరకంద పట్టణంలోని అన్ని పర్యాటక ప్రాంతాలలో, అతి ఎత్తైన ప్రదేశం అయినటువంటి గొప్ప శిఖరం, చాలా ప్రాచుర్యం పొందింది. స్థానికులు పవిత్ర ప్రార్థనా స్థలంగా భావించే హాటు మాతా ఆలయం, కొండ పైన ఉంది.
సమయం మరియు మార్పు యొక్క హిందూ దేవత కాళి కి అంకితం చేయబడ్డ మహామాయ ఆలయం, నరకంద వద్ద ఉన్న మరొక ప్రసిద్ధ ఆలయం. నరకంద నుండి కొద్ది దూరంలో ఉన్న తానేదార్ లో, విస్తారమైన ఆపిల్ తోటలతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన, ప్రసిద్ధ స్టోక్స్ ఫారం ఉన్నది. 18వ శతాబ్దంలో అమెరికా జాతీయుడైన శామ్యూల్ స్టోక్స్ చే ప్రారంభించబడిన ఈ వ్యవసాయ భూమి, అతని వారసత్వంగా పరిగణించబడుతుంది. యాత్రికులు, నరకంద నుండి 17 కి.మీ.ల దూరంలో, సట్లెజ్ నది ఎడమ తీరం పైన ఉన్న, కోట్గఢ్ అనే పురాతన గ్రామాన్ని కూడా సందర్శించవచ్చు. గ్రామం, గుర్రపుడెక్క ఆకారంలో ఉన్న లోయ కొరకు ప్రసిద్ధి చెందింది.
సందర్శకులు కోట్గఢ్ నుంచి, కులు లోయ, వంకరటింకర రహదారులు, మంచు కప్పబడిన హిమాలయ పర్వతాల విస్తృత దృశ్యాలు పొందుతారు.
స్కీయింగ్ మరియు ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి చెందిన నరకంద, సాహస ఔత్సాహికులకు హిమాలయ శ్రేణి యొక్క మంచు వాలు ప్రదేశాలలో శీతాకాలపు క్రీడలు ఆడే అవకాశం అందిస్తుంది. ఏప్రిల్, జూన్ మధ్యలోని వేసవి సమయంలో ఇక్కడ మధ్యస్థ వాతావరణం ఉండి, సందర్శనకి అత్యంత అనువుగా ఉంటుంది. పర్యాటకులు, వాయు, రైల్వే లేదా రహదారి మార్గాల ద్వారా సులభంగా నరకంద చేరుకోవచ్చు.