ఈ ఆలయం చాముండాదేవి కి గొప్ప భక్తుడైన ఈ ప్రాంత పాలకుడు నాన్ కరణ్ రాజు చే నిర్మించబడిందని నమ్మకం. కొండ కింది భాగ౦లో నిర్మించిన ఈ ఆలయం, నగర నడిబొడ్డున ఉంది. కొన్ని సంవత్సరాల తరువాత, నార్నాల్, చుట్టుపక్కల ప్రదేశం ఇక్కడ మసీదు నిర్మించిన ముఘల్ పాలకుల అధీనంలోకి వెళ్ళింది. స్వతంత్రం వచ్చిన తరువాత, ప్రజలు ఈ ప్రాంతాన్ని పైకితవ్వి, శిధిలమైన స్థితి నుని ఆలయానికి వెలుగుతీసుకొచ్చారు. ఈరోజు, ఈ పట్టణంలో తప్పక సందర్శించ దగిన ఆలయం, దూరం నుండి భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వస్తారు.