పేరుకుతగ్గట్లుగానే, జల్ మహల్ నీటితో చుత్తబడిఉన్న ఒక రాజభవనం. ఇది 1951 లో అక్బర్ కోర్ట్ అధికారి, నార్నాల్ పాలకుడు అయిన షాహ్ కులీ ఖాన్ చే నిర్మించబడింది, ఈ స్మారక చిహ్నం పెర్షియన్, భారతీయ వాస్తుశాస్త్ర అద్భుతమైన సమ్మేళనాన్ని సూచిస్తుంది. నీటి మధ్యలో నిలబడి ఉండే ఈ జల్ మహల్ ఇప్పుడు ఎండిపోయి ఉంది. ఉత్తరం నుండి గట్టుపై, తెరుచుకొని ఉన్న వంపుతిరిగిన ప్రవేశ ద్వారం నుండి, టాంక్ కు దారితీస్తుంది.
ప్రధాన భవనం చుట్టూ నాలుగు మినార్లు ఉంటాయి, పైకి వెళ్ళడానికి వీటన్నిటికీ మెట్లు ఉంటాయి. కింద గదులు విడిపోయి, వాటిని చూడడానికి ఆధారాలేమీ ఉండవు. లోపలి భాగం ప్రధానంగా బంగారు రంగుతో అలంకరించబడి ఉంటుంది, చిత్రాలు, నమూనాలు, గోడలు, పైకప్పు పై రేఖాగణిత నమూనాలు ఉంటాయి. జల్ మహల్ ఒక చారిత్రక భవనం, ఇది ప్రస్తుతం మరమ్మత్తులు నిర్వహిస్తూ హర్యానా ప్రభుత్వం వారి అధీనంలో ఉంది.