మసీదు లాగా కనిపించే ఈ సమాధి, క్రీశ. 12 వ శతాబ్దంలో ఇక్కడ నివశించిన హజ్రత్ తుర్కమాన్ సాధువుదని నమ్ముతారు. బయట నిర్మించిన గోపురం అసలు సమాధిని కప్పివేస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత, ఒక వరండా బ్రిటీషు వారిచే చేర్చబడింది. మొఘల్ కాలంలో కూడా ఈ సమాధికి అదనపు జోడింపులు చేర్చారు. ఈ స్మారక చిహ్నం తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ప్రార్ధనలు చేయడానికి ఇక్కడికి వచ్చే అన్ని మతాల భక్తులను ఆకర్షిస్తుంది.