అక్బర్ పాలనా కాలంలోని నార్నాల్ గవర్నర్ షాహ్ కులి ఖాన్ చే క్రీశ. 1589 లో స్థాపించబడిన ట్రిపోలియా దర్వాజా ఆయన తోట ప్రధాన ద్వారంగా సేవలందించింది. ఈ తోటలో మరో మూడు ప్రవేశ ద్వారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ క్రీశ. 1574-75 లో షాహ్ కులీ ఖాన్ తనకోసం తాను స్వయంగా కట్టుకున్న సమాధి ఉంది. అష్టభుజి ఆకృతి వేదికగల ఈ సమాధిని దక్షిణ౦ నుండి చేరుకోవచ్చు. బూడిద రంగు, ఎరుపు ఇసుకరాయితో చేసిన ఈ సమాధి రూపం గుర్తించదగింది. సన్నని మార్గం, పైకికనిపించే మార్గాలకు ఆధారం, కమానుల ప్రారంభాలు, విరామాల ఆధారంతో పాటు మొత్తం పరుగెడతాయి.
ఈ సమాధి లోపల రెండు అంతస్తులు ఉన్నాయి. కింద అంతస్థుని పాలరాయితో చేసారు అయితే రెండవ అంతస్తు అందమైన సున్నపు ప్లాస్టర్ తో చేసారు. ఈ సమాధి అష్టభుజి ఆక్రుతిగల డ్రమ్ముపై నిర్మించబడి, తక్కువ గుమ్మటాల సమూహంచే ఎత్తుగా ఉంది.