పభ అభయారణ్యం అస్సాం రాష్ట్రంలో లఖింపూర్ జిల్లాలో ఉన్నది. 49 చదరపు కిలోమీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ చిన్న అభయారణ్యంను మిల్రో అభయారణ్యం అని పిలుస్తారు. పభ అభయారణ్యం ప్రత్యేకంగా ఆసియా దున్నపోతులను రక్షించడానికి రూపొందించబడింది.
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం సరిహద్దులో ఉన్న ఈ అభయారణ్యం చాలా అందంగా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ప్రధానంగా దాని సహజ అందమైన దృశ్యం చూడటం కొరకు ఈ ప్రదేశమునకు వస్తారు. ఈ అభయారణ్యంనకు ప్రతి సంవత్సరం వలస పక్షులు తరలి వస్తాయి. ఈ పక్షులు చెట్టు పైభాగంమున నివసిస్తు,ప్రకృతి ప్రేమికులకు చాలా అద్భుతమైన వీక్షణను సృష్టిస్తాయి.
ఈ అభయారణ్యంనకు లఖింపూర్ జిల్లా ప్రాంతంలో మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది గౌహతి నుండి సుమారు 370 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే సమీప పట్టణం లఖింపూర్ బాగా అనుసంధానించబడింది. ఈ చిన్న అభయారణ్యం ప్రయాణం చేయడానికి కష్టం కాదు. జంతువులను గుర్తించడం కొరకు ఉత్తమ సమయం నవంబరు నుంచి ఏప్రిల్ నెలల వరకు శీతాకాలంలో ఉంది.