గురుద్వారా షాహిద్ గంజ్ తల్వండి జట్తాన్ ను సుబేదార్ శామాస్ఖాన్ తో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికుల గౌరవార్ధం నిర్మించారు. ఈ సుబేదార్ బెహ్రాం నుండి ఒక బాలికను ఎత్తుకు పోగా అతనితో గోద్రియ సింగ్, లోద్రియా సింగ్, రూప కౌర్ లు యుద్ధం చేసి మృతి చెందారు. వారి సమాధి స్థలం లో ఈ గురుద్వారా వెలసింది. సిక్కు గురువుల జన్మ దినోత్సవాలలో ప్రతి ఏటా ఇక్కడ వివిధ ప్రోగ్రామ్లు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు టూరిస్ట్ లు , భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలి వస్తారు. ఈ గురుద్వారా రాహోన్ రైల్వే స్టేషన్ కు పదికి. మీ.ల దూరంలో కలదు.