నీమచ్ , ఇది 30 జూన్, 1998 లో జిల్లాగా రూపు దిద్దుకొనకముందు, ప్రారంభంలో మధ్య ప్రదేశ్, మాంద్సౌర్ జిల్లాలో భాగంగా ఉన్నది. ఇది, బ్రిటిష్ పాలనలో ఒక సైనిక పట్టణంగా ఉన్నది. ఉత్తర భారతదేశ మౌన్టేడ్ ఆర్టిలరీ మరియు అశ్విక ప్రధాన కార్యాలయం (NIMACH)గా ప్రాచుర్యం పొందింది. 1939 లో, నీమచ్, క్రౌన్ యొక్క రిప్రజెంటేటివ్ పోలీస్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ కు తిరిగి చేరటం జరిగినది. అందువలన, నీమచ్, మధ్యప్రదేశ్ లోని కంటోన్మెంట్ పట్టణాల పరంగా బలమైన స్థానంలో ఉన్నది.
నీమచ్ :సంప్రదాయాలు మరియు దాని ప్రత్యేకత
నీమచ్ పర్యాటకులను ఆకర్షించడానికి కారణమేంటంటే ఈ ప్రదేశంలో జరిగే తాజియా యొక్క ప్రత్యేక మొహర్రం ఊరేగింపులు. ఇది 150 సంవత్సరాల వయస్సు గలది. ఈ ఊరేగింపు ఇమామ్ హుస్సేన్ బలిదానం గుర్తుగా జరుగుతున్నది. నీమచ్ జిల్లా నిస్సందేహంగా మొత్తం రాష్ట్రంలో ప్రఖ్యాతి చెందింది. నీమచ్ టూరిజంవారు కొన్ని అద్భుతమైన హాట్ స్పాట్ అందింస్తున్నారు, సందర్శకులు వారి సమయాన్ని వీటికోసం ఉపయోగించుకుంటే, ఆ సమయానికి తగ్గ విలువ చేస్తుంది.
నీమచ్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు
నీమచ్ టూరిజంవారు పర్యాటకులకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను అన్వేషించటంలో మరియు వారిని సంతోష పెట్టటంలో సహాయం చేస్తున్నారు. నీమచ్ చుట్టూ చాలా ఆకర్షణీయమైన మార్కెట్లు ఉన్నాయి. సుఖానంద్ జీ ఆశ్రమం, నవ తోరణ్ ఆలయం, మహాత్మా గాంధీ సాగర్ ఆనకట్ట, మహాత్మా గాంధీ సాగర్ అభయారణ్యం, భద్వమాత ఆలయం వంటి ప్రదేశాలు పర్యాటకుల సందర్శనార్థం కోసం ఉన్నాయి. ఈ ప్రదేశం మధ్యప్రదేశ్ లో పర్యాటకులకు ఒక ఆకర్షణీయంగా ఉన్నది.
నీమచ్ కు ప్రయాణం
నీమచ్ మధ్య ప్రదేశ్ లోని ఇతర ప్రదేశాలకు అనుసంధించబడి ఉన్నది. దీనికి దగ్గరలో ఉదైపూర్ విమానాశ్రయం ఉన్నది. దీనిని సందర్శించటానికి శీతాకాలం అనుకూలంగా ఉంటుంది.