ఇది నీమచ్ కి 32 కి.మీ.దూరంలో ఉన్నది; ఇది రాజస్తాన్ బోర్డర్ మీద ఉన్నది. ఈ ఆశ్రమం ఒక పురాతనమైన రాతిగుహలో ఉన్నది. దాని ప్రాంగణంలో పరమశివుడికి అంకితమైన ఆలయం ఉన్నదని నమ్ముతారు; ఈ ఆశ్రమం అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉన్న స్పాట్ అని ప్రశంసలు అందుకుంటున్నది. ఈ ఆశ్రమ వ్యవస్థాపకుడు, వ్యాసదేవ కుమారుడు, శుకుడు అని భావిస్తారు.
వ్యాసదేవ లేదా వేదవ్యాస 24,000 శ్లోకాలు ఉన్న "భరత సంహిత" అనే గ్రంథాన్ని రచించారు. సుక, ఈయనను శుకదేవ మరియు బ్రహ్మరత అని కూడా పిలుస్తారు. ఈయన వైష్ణవిజం మీద పురాణ గ్రంథాలు అనేకం వ్రాశారు. ఇక్కడికి ప్రతి సీజన్లో అనేకమంది పర్యాటకులు వొస్తుంటారు. ఇక్కడ హర్యాలి అమావాశ్య మరియు వైశాఖ పూర్ణిమ అనే రెండు ఉత్సవాలు గొప్ప వేడుకగా జరుపుతారు. ఈ సమయంలో నీమచ్ పర్యటన ఒక గొప్ప అనుభూతిని పర్యాటకులకు మిగులుస్తుంది.