బారా షహీద్ దర్గా, నెల్లూరు సమీపం లోని సూళ్ళూరు పేట లో కలదు. దీనిని 12 మంది మృతవీరుల పేరుతో నిర్మించారు. ఈ దర్గా దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని చెపుతారు. ఈ దర్గాలో మొహర్రం ఉత్సవాలు అతి ఘనంగా జరుగుతాయి. మరో వేడుకగా మూడు రోజుల పాటు రొట్టెల పండుగ అని కూడా చేస్తారు.
ఈ దర్గా సముద్ర తీరానికి సుమారు అయిదు కి. మీ. ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ దర్గాని అమావాస్య నాడు సందర్శించటం మంచిదని చెపుతారు.