నిలంబూర్ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనోలీస్ ప్లాట్, ప్రపంచపు మొట్టమొదటి పురాతన తోట. విశాలమైన భూభాగంలో విస్తరించి ఉన్న ఈ తోటలకి బ్రిటిష్ కాలంలో మలబార్ జిల్లా కలెక్టరుగా పనిచేసిన హెచ్.వి.కోనోలీ పేరును పెట్టారు. పంతొమ్మిదవ శతాబ్దపు మధ్య కాలంలో కోనోలీ పాలనలో అతని కింది స్థాయి అధికారి శ్రీ చంతు మీనన్ ఆధ్వర్యంలో ఈ తోటల ఏర్పాటు ప్రారంభమయింది. నిజానికి మద్రాస్ ప్రెసిడెన్సీ అటవీ శాఖ వారి చర్యల క్రమబద్దీకరణలో భాగంగా ఈ తోటలు ఏర్పాటుచేసారు. రెండవ ప్రపంచ యుద్ధంలో గ్రేట్ బ్రిటన్ వారి కలప అవసరాలను తీర్చిన సాధనం కోనోలీ ప్లాట్. ప్రస్తుతం కొనాలి ప్లాట్ ప్రభుత్వ కలప డిపో దగ్గరగా వడపురం అనే ప్రాంతంలో ఉంది. చలియార్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి చేరడానికి పర్యాటకులు ఫెర్రీ పై నదిని దాటాల్సి ఉంటుంది. ఇది అందించే ప్రశాంతతలో తమని తాము మర్చిపోవాలనుకొనే వారికి కొనాలి ప్లాట్ ఒక ఉత్తమ ప్రదేశం.