దట్టమైన వర్షాధార అడవులకు ప్రసిద్ది చెందిన నెడుం కయం, నిలంబూర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ఈ ప్రాంతంలో ఎన్నో రకాల వృక్ష జంతు జలాలు విస్తృత౦గా ఉన్నాయి.బ్రిటిష్ కాలంలో నిర్మించిన కలప వసతి గృహం నేడుమ్కయం లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఈ వసతి గృహం నుండి సందర్శకులు పరిసరాలలోని పచ్చదనాన్ని, జంతుజీవనాన్ని వీక్షించవచ్చు.పచ్చదనాల సంపద నెడుం కాయం ఆటవీక్షేత్రంలో ఏనుగులు, దున్నలు, పులులు, కుందేళ్ళు, నీలి కోతులు, ఎలుగుబంటి, అడవి పిల్లి, జింకలు వంటి ఎన్నోరకాల జంతుజాతులు ఉన్నాయి. ఈ ప్రాంత పరిరక్షణకు కఠీన చర్యలు చేపట్టినందున సందర్శకులు అటవీశాఖ వారి అనుమతి తీసుకొన్న తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో ప్రవేశించాలి.నెడుం కాయంలో ఉన్న ఒక ఏనుగుల మచ్చిక శిబిరం ఈ ప్రాంతానికి ప్రతి ఏడు వేలాదిమంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం నీలగిరి జీవావరణ పరిరక్షణలో భాగమే కాక కేరళ ప్రభుత్వం వారి రెండవ పర్యావరణ పర్యాటక రంగ అభివృద్ది ప్రాజెక్ట్ క్రింద ఎంపిక చేయబడింది. ప్రకృతి దృశ్యాల విస్తృత మార్గాలతో కూడిన నెడుం కాయం ఒక ఉత్తమ పర్వతారోహణ ప్రాంతం