మైత్రేయ బుద్ధ అంటే భవిష్యత్ బుద్ధ అని లేదా లాఫింగ్ బుద్ధ అని అంటారు. నుబ్రా వాలీలో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. ఈ విగ్రహం పొడవు సుమారు 32 మీటర్ల ఎత్తు కలిగి వుంటుంది. ఇది ఒక కొండపై ఓపెన్ గా వుండి శ్యూక్ రివర్ వైపుగా పాకిస్తాన్ దిశగా చూస్తూ వుంటుంది. ఈ విగ్రహాన్ని వాలీ లోని స్థానికులు విరాళాలతో కట్టారు.
యెల్లో టోపీ తెగ అభివృద్ధి కొరకు మరియు రిజు ఆరామం అభివృద్ధి కి సుమారు 8 కిలోల బంగారాన్ని కూడా విరాళం గా పొందారు. దీని నిర్మాణం ఏప్రిల్ 2006 లో మొదలైంది. పూర్తి అయిన తర్వాత ఈ విగ్రహాన్ని 25 జూలై, 2010 నాడు టిబెట్ ఆధ్యాత్మిక నేత పూజ్యుడు అయిన దలైలామా పవిత్రం చేసారు. స్థానికుల మేరకు, మైత్రేయ బుద్ధ విగ్రహం శాంతిని నెలకొల్పి డిస కిట్ గ్రామ పరి రక్షణకు తోదపడుతోంది అని భావిస్తారు.