బడా మహాదేవ కేవ్ పంచామారి నుండి పది కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇక్కడ శివుడు దేముడు . ఇది అరవై అడుగుల పదవున్న గుహ. ఈ గుహలో ఇంకా బ్రహ్మ, విష్ణు, గణేశ విగ్రహాలు కూడా వుంటాయి. స్థానిక కధనాల మేరకు, ఈ ప్రదేశం లో విష్ణు మూర్తి భస్మాసుర రాక్షసుడిని మోహిని రూపంలో సంహరించాడని చెపుతారు. ఈ గుహలో నిరంతరం నీరు పడుతూ ఒక మడుగుగా తయారైంది. ఈ మడుగులో స్నానం చేస్తే చెడు అంతా పోతుందని చెపుతారు. ఈ ప్రదేశం అన్వేషణకు, భక్తికి నిలయంగా వుంటుంది.