పకూర్, ఝార్ఖండ్ లో ప్రధాన ఆర్ధిక ఆదాయంగా భావించబడే బీడీల తయారీకి ప్రసిద్ధిగాంచిన జార్ఖండ్ లోని ఒక జిల్లా. ఇది 1994 లో జిల్లాగా అప్ గ్రేడ్ చేయబడే వరకు సాహిబ్గంజ్ లో ఒక ఉప-విభాగంగా ఉంది. దీనికి తూర్పున సాహిబ్గంజ్ జిల్లా, దక్షిణాన వెస్ట్ బెంగాల్ లోని బిర్భూం జిల్లా, తూర్పున వెస్ట్ బెంగాల్ లోని బిర్భూం జిల్లలో ఒక భాగం, ముర్షిదాబాద్, పశ్చిమాన దుమ్కా & గొడ్డా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
ఈ జిల్లా, ఒకప్పుడు దట్టమైన & విస్తారమైన అడవులకు పేరుగాంచింది, ప్రస్తుతం అటవీ సంపద అంతగా లేదు. సర్పగంధ, రాయిగామి లేదా దామి, కజ్వ, చిర్యయిత వంటి ఔషధ మొక్కలు అన్నిటినీ కలిగిఉంది. ఇక్కడ గత కొద్ది సంవత్సరాలుగా అడువుల విధ్వంస౦ ఎక్కువగా ఉంది. ఈ జిల్లలో బంస్లోయి, టోరాయి & బ్రహ్మిని అనేవి మూడు ప్రధాన నదులు. బంస్లోయి & టోరాయి నదులు మధ్యలో ప్రవహిస్తే, బ్రహ్మిని జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో ప్రవహిస్తుంది.
పకూర్ చరిత్ర
ఈ ప్రాంత ప్రామాణిక చరిత్ర మధ్యయుగ కాలం ముందు చాలా తక్కువ ప్రసిద్ది చెందింది. ప్రధానంగా పకూర్ రాజ్, మహేశ్పూర్ రాజ్ ల రెండు చిన్న ఎస్టేట్లు ఉనికిలో ఉన్నాయి. మొఘల్ పరిపాలనకు చెందిన ఈ ఇద్దరు జమీందార్లు పహారియ డొమైన్ సంరక్షణ, పోషణ బాధ్యతలను స్వీకరించారు.
ప్లాసీ యుద్ధం తరువాత గెలుపొందిన బ్రిటీషువారు వెస్ట్ బెంగాల్ లోని బిర్భూం జిల్లా ద్వారా ఈ ప్రాంతాల నియంత్రణకు పరిపాలనా నెట్వర్క్ ను అభివృద్ది చేసారు. ఈ ప్రాంత నిజమైన నివాసస్తులైన పహరియాలపై విజయానికి ప్రణాళిక తయారుచేసిన మొట్టమొదటి బ్రిటీషు ఆఫీసర్ కెప్టెన్ బోరోని.
సిద్ధూ, కాన్హు చంద్ & భైరవ్ వంటి సంతల్ నాయకుల సహకారం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వారి స్మారక అవశేషాలు సంతల్ పరగన విభాగంలోని వివిధ ప్రదేశాల వద్ద చూడవచ్చు.
పకూర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు
పకూర్ ధార్మిక, ఔత్సాహిక పర్యాటకుల ఇద్దరికీ కొన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణలను అందిస్తుంది. సిద్ధూ కన్హ పార్క్, పకూర్ పర్యాటకులు తప్పక సందర్శించదగ్గ నిత్యకాళి మందిరం, వంటివి పకూర్ లోని కొన్ని ప్రధాన ఆకర్షణలు. ధరణి పహార్, సందర్శకులు కొలనులో పవిత్ర స్నానాలు ఆచరించే వేడినీటి బుగ్గ వంటివి కొన్ని ఇతర ఆశక్తికర ప్రదేశాలు.
పకూర్ సందర్శనకు సరైన సమయం
పర్యాటకులు పకూర్ సందర్శనకు శీతాకాలం సరైన సమయం. ఈ సమయంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది, ఈ సమయంలో తేలికైన శీతాకాలం దుస్తులు తీసుకెళ్లడం మంచి ఆలోచన.
పకూర్ చేరుకోవడం ఎలా
పకూర్, ఝార్ఖండ్ రాజధాని రాంచి నుండి టాక్సీలు, బస్సులలో తేలికగా చేరుకోవచ్చు. పకూర్ లో రైల్వే స్టేషన్ ఉంది, రవాణాకు రైళ్ళు ప్రధాన పద్ధతి.
శీతాకాలం 9 నుండి 20 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత ఒకమోస్తరు వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈ సమయంలో తేలికపాటి శీతాకాల దుస్తులతో ప్రయాణించడం సరైన ఆలోచన. శీతాకాలం చాలా చల్లగా, ఎక్కువభాగం సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది.