పాలంపూర్ నగరంలో శోభా సింగ్ ఆర్ట్ గ్యాలరీ ఒక గొప్ప ఆకర్షణ, ఇక్కడ పంజాబ్ నుండి వొచ్చిన ఒక గొప్ప చిత్రకారుడు,సర్ శోభ సింగ్ వేసిన ఎన్నో కళాత్మక చిత్రాలు ఉన్నాయి. ఈ గేలరీ పాలంపూర్ నుండి 12 కి. మీ. దూరంలో ఉన్నది.
సర్ శోభ సింగ్ ఎక్కువగా సిఖ్ గురువుల చిత్రాలు గీశారు. 1969 లో గురు నానక్ 500వ పుట్టినరోజు సందర్భంగా గీసిన కళాత్మక రూప చిత్రం గురు నానక్, ఇది గురు నానక్ కు ప్రతిరూపం అని, ఇది ఆయనకు చాలా దగారగా ఉన్నాడని ప్రజల నమ్మకం. ఈయన గీసిన ధౌలధర్ శ్రేణుల నేపథ్యంలో గడ్డి తెగ జాతి ప్రజలు అనే ఒక గొప్ప చిత్రాన్ని కూడా ఇక్కడ చూడవొచ్చు.
1940 లోని సోహ్ని-మహివాల్ చిత్రం సందర్శకులకు ఒక గొప్ప ఆకర్షణ. హీర్-రాంఝా అనే చిత్రపటం కూడా సందర్శకులచేత మెప్పు పొందుతున్నది. షహీద్ భగత్ సింగ్, మహాత్మా గాంధి, లాల్ బహదూర్ శాస్త్రి వంటి అనేక ఇండియా హీరోలు, లీడర్ల చిత్రాలు ఇక్కడ చూడవొచ్చు.