పలమవు ఝార్ఖండ్ రాష్ట్రంలోని ఏకైక టైగర్ రిజర్వ్. ఇది భారతదేశంలోని అసలైన తొమ్మిది టైగర్ రిజర్వ్ లలో ఒకటిగా కూడా పిలువబడుతుంది. ఈ రిజర్వ్ 1,014 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. దీని ప్రధాన ప్రాంతం కేవలం 414 చదరపు కిలోమీటర్లు, మధ్య ఉండే ప్రదేశం షుమారు 600 చదరపు కిలోమీటర్లు ఉంటుంది.
ఈ ప్రదేశంలో రామందగ్, లాతూ, కుజురుం వంటి కొన్ని అటవీ గ్రామాలూ కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం 1973 వ సంవత్సరంలో టైగర్ రిజర్వ్ గా ఏర్పడింది. అయితే, ఇక్కడ పులుల సంఖ్య కొరతగా ఉంది. 2012 లో, ఒక మగ పులి, ఐదు ఆడపులులు కనుగొనబడ్డాయి.
పలమవు టైగర్ రిజర్వ్, 1947 వ సంవత్సరంలో భారతీయ అటవీ చట్టం కింద రిజర్వేడ్ ఫారెస్ట్ గా ప్రకటించబడింది, కొన్ని సంవత్సరాల తరువాత ఇది టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు. ఇక్కడ పులులే కాకుండా, మీరు ఏనుగు, చిరుత, సాంబార్, అడవి దున్న వంటి ఇతర జంతువులను చూడవచ్చు.
ఈ అడవి సాహసౌత్సాహిక పర్యాటకుల కోసం అందమైన జలపాతాలు, కొండ వాలులు, ఆకురాల్చే గడ్డిభూములు మొదలైన వాటిని కలిగి ఉంది. ఈ ప్రాంతంలో ముర్హు, హులుక్, గుల్గుల్, నేతర్హట్ వంటి కొన్ని ముఖ్యమైన కొండలను కలిగి ఉంది.