పాలన్పూర్ నగరం ఎక్కువగా జైనమతంతో ముడిపడి ఉంది. ఈ ప్రదేశంలోని జైన ఆలయాల సంఖ్యా ఈ అందమైన ప్రదేశంలో ఈ మతం ఎంత ప్రసిద్ది చెందిందో తెలియచేస్తుంది. పలన్పూర్ నగరంలో మోటు దేరసర్ లేదా పల్లవియ పార్శ్వనాద్ ఆలయం ఒక ప్రసిద్ధ జైన మందిరం. పాలన్పూర్ స్థాపకుడు, ప్రహలాదన్ రాజుచే స్థాపించబడిన ఈ మందిరంలో జైనమత 23వ ప్రభువైన పార్శ్వనాథుని విగ్రహం ఉంది. ఇది జైనమత అనుచరుల ప్రత్యెక శ్రద్ధతో విస్తరించడం వల్ల 108 పార్శ్వనాద్ ఆలయాలలో ఒకటిగా ఉంది.