అదీశ్వర్ దేవాలయాన్నే చౌముఖ దేవాలయం అని కూడా అంటారు. దీనిని 15వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయం శిల్పశైలికి ప్రసిద్ధి చెందింది. స్వర్గ విమాన నమూనాలు నళినిగులం విమాన గోపురంపై నిర్మించారు. జైన దేవాలయాలలో ఇది అతి పెద్దది. నిర్మాణానికి 65 సంవత్సరాల కాలం పట్టింది.
దేశంలోని అయిదు ప్రసిద్ధి చెందిన దేవాలయాలలోను ఇది ఒకటిగా జైనులు భావిస్తారు. దేవాలయ భవనం మూడు అంతస్తులు, 80 డోములు, 20 హాళ్ళు కలిగి ఉంటుంది. పర్యాటకులు సుమారు 1444 స్తంభాలను చూడవచ్చు. దేవాలయంలో నాలుగు ముకాలు కల ఆదినాధుడు లేదా రిషభ్ దేవ్ ఉంటారు.