నింబో కా నాధ్ పాలిలో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ ప్రదేశం ఫల్నా మరియు సందేరవ్ మార్గంలో కలదు. హిందు పురాణాల మేరకు పాండవులు ఈ ప్రదేశంలో వారి అరణ్య వాసంలో నివసించారని ఇక్కడ కల శివుడిని వారి మాత కుంతి పూజించిందని చెపుతారు. పర్యాటకులు ఫల్నా వరకు బస్ లో చేరి అక్కడ నుండి స్ధానిక టాక్సీలు, జీపులలో నింబో కా నాధ్ కు ప్రయాణించవచ్చు.