గురుద్వారా పాంట సాహిబ్, పాంట సాహిబ్ లో ఉన్న సిఖ్ పవిత్రమైన పూజ స్థలం. 10వ సిఖ్ గురువు అయిన గురు గోవింద్ సింగ్ ఇక్కడ 'దస్సం గ్రంథ' లేదా 'బుక్ ఆఫ్ ది టెన్త్ ఎంపరర్' అనే సిఖ్ గ్రంథాన్ని ఇక్కడే రచించారని ఒక నమ్మకం. గురు గోవింద్ సింగ్ ఇక్కడ నాలుగు సంవత్సారాలు ఉన్నారని ఇక్కడి స్థానికులు చెపుతుంటారు.
చరిత్ర ప్రకారం, గురువు పాంట సాహిబ్ లో ఉండటానికి నిశ్చయించుకోగానే, ఆటను ఎక్కిన గుర్రం దానంతట అదే ఇక్కడ ఆగిపోయిందని చెపుతారు. జానపద కథనం ప్రకారం ఇక్కడ 'దస్సం గ్రంథ' సిఖ్ మతగ్రంథాన్ని రచించటానికి కూర్చొని, యమున నదిని నిశబ్దంగా ప్రవహించమని వేడుకున్నారుట. అప్పటినుండి ఈ నది నిశబ్దంగా ప్రవహిస్తున్నదని చెపుతారు.
గురుద్వారాలో ఉన్న శ్రీ తలాబ్ ఆస్థానము, ఇక్కడే గురు గోవింద్ సింగ్ జీతాలు పంచేవారని చెపుతారు. గురుద్వారాలో ఉన్న శ్రీ దస్తర్ ఆస్థాన, ఇక్కడ తలపాగా చుట్టుకోవటంలో పోటీలు నిర్వహించేవారని చెపుతారు. ఇంకొక ఆకర్షణ ఏమిటంటే గురుద్వారా మ్యుజియం, ఇక్కడ గురువు ఉపయోగించిన కాలాలు మరియు ఆయుధాలు ఉన్నాయి.