పరదీప్ లో ఒక ప్రాంతమైన స్మూర్తి ఉద్యాన్, 1999 లో పరదీప్ లో వచ్చిన భారీ తుఫానులో జీవితాలు పోగొట్టుకున్న వేలమంది ప్రజలకు అ౦కితంచేయబడిన స్థలం. ఈ తుఫాను మరణాన్ని, విధ్వంసాన్ని విడిచివెళ్ళింది, ఇక్కడ అమాయక జీవితాలకు కేటాయించబడ్డ ఈ తోటలాంటి అందమైన మరో స్మారకం లేదు. ఈ తోట అన్నిరకాల సందర్శకులను రంగుల పుష్పాలతో మనస్పూర్తిగా ఆహ్వానిస్తుంది.
విలక్షణంగా చెక్కబడిన శిల్పాలు ఈ తోట అందాన్ని మరింత పెంచాయి. ఈ తోట ఒకసారి సందర్శనకు విలువైనది. ఈ తోటలో 1990 లో తుఫాను సంఘటను గుర్తుగా ఏర్పాటుచేసిన ఈ మ్యూజికల్ ఫౌంటైన్, ఎవరి మనసునైన కరిగిస్తుంది. పువ్వులు పూర్తిగా వికశించి ఉండి, మంత్రముగ్ధమైన రంగులతో సందర్శకులను ఆహ్వానించే నవంబర్ నుండి మార్చ్ వరకు ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఉత్తమం.