దాయింగ్ ఎరింగ్ వన్యప్రాణుల అభయారణ్యం రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన ఉద్యానవనాలలో ఒకటిగా ఉంది. ఇది పర్యావరణ పర్యాటకం కోసం ఒక ఖచ్చితమైన ప్రదేశంగా ఉన్నది. ఈ అభయారణ్యం యొక్క ప్రధాన భాగం ఒండ్రు గడ్డి భూములు కలిగి మరియు మిగిలిన ప్రాంత అడవుల్లో నీటి ద్వారా కప్పబడి ఉంటుంది. ఈ అభయారణ్యం చుట్టూ సింగ్ నది( బ్రహ్మపుత్ర )ఉండి ఒక అందమైన చిత్ర కోణాన్ని అందిస్తుంది.
ఈ అభయారణ్యం సుమారు 190 sq.km విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అంతేకాక ఇక్కడకు సైబీరియా మరియు మంగోలియా వంటి ప్రదేశాల నుండి వచ్చే వలస పక్షుల అందమైన దృశ్యంనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ విధంగా పక్షులను చూడటం పర్యాటకులకు మరియు స్థానికులకు ఒక ఇష్టమైన కార్యకలాపంగా ఉంటుంది.
దాయింగ్ ఎరింగ్ వన్యప్రాణుల అభయారణ్యం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళడానికి ప్రవేశ ద్వారంగా ఉన్న పసిఘాట్ నుండి కేవలం 13km దూరంలో ఉంది.