ఒకప్పుడు మధ్యయుగ కాలంలో గుజరాత్ రాజధాని అయిన పటాన్ నేడు ఆ పురాతన కాలమునకు సాక్ష్యంగా నిలచింది. పటాన్ 8వ శతాబ్దంలో చాళుక్య రాజపుత్రుల చావడ కింగ్డమ్ అయిన వనరాజ్ చావడ అనే రాజు నిర్మించిన కందంకం,దుర్గములు మొదలైన వాటిచే శక్తివంతంగా నిర్మించిన నగరం.
ఈ నగరమునకు రాజు వనరాజ్ యొక్క గొర్రెల కాపరి స్నేహితుడు అయిన అనహిల్ పేరును పెట్టారు. నగరమును అన్హిల్వాడ్ పటాన్ అని పిలుస్తారు. ప్రస్తుత నగరంలో ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్ అయిన కుతుబ్-ఉద్ దిన్ అయ్బాక్ వల్ల నాశనం అయిపోయిన రాజ్యం యొక్క శిధిలాలు ఉన్నాయి. ముస్లిం మతం దూకుడు వ్యాప్తి ఫలితంగా, పటాన్ లో అహ్మదాబాద్ వంటి వాటి కంటే కూడా పురాతనమైన కొన్నిముస్లింమత నిర్మాణాలు ఉన్నాయి.
పర్యాటకులు ఆకర్షించే రాణి కి వావ్ ,త్రికం బరోట్ ని వావ్, కాల్కా సమీపంలో ఓల్డ్ ఫోర్ట్, సహస్రలింగ సరోవర్ మొదలైనవి మరియు చాళుక్య లేదా సోలంకి కాలంనకు చెందిన నిర్మాణ అవశేషాలు పూర్తిగా చూడవచ్చు. జైనమతం యొక్క ప్రసిద్ధ కేంద్రాలలో పటాన్ ఒకటి. జైన దేవాలయాలు సోలంకి కాలంలో నిర్మించబడ్డాయి. ప్రస్తుతం పటాన్లో పటోల చీరలకు కూడా ప్రసిద్ధి చెందింది.