కొడుమాన్ చిలంతియాంబళం దేవాలయం పాతానం తిట్ట కు 16 కి.మీ.ల దూరంలో కలదు. ఇది కొడుమాన్ అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయంలో మహలక్ష్మీ ప్రధాన దైవం. కుల, మత విచక్షణ లేకుండా ఈ దేవిని ఇక్కడివారు ఆరాధిస్తారు. ఈ దేవాలయాన్ని శక్తిభద్ర రాజులు నిర్మించారు.
కొడుమాన్ ప్రసిద్ధ రచయిత ఆచార్య చూడామణి జన్మస్ధలం. ఈ ప్రదేశంలో ఒక మహిమలు కల నీరున్న బావి కలదు. ఈ బావినీరు చర్మ వ్యాధులను నయం చేస్తుందని చెపుతారు. దూర ప్రాంతాలనుండి వచ్చి బావినీటిలో స్నానాలు ఆచరించి వెళతారు. ఈ బావిని చిలాంతిరినార్ అంటే సాలెపురుగుల బావి అని పిలుస్తారు.