పాటలీపుత్ర నేటి పాట్న, పురాతన భారతదేశంలోని ఒక నగరం, నేడు ఇది బీహార్ లో రద్దీ రాజధాని నగరం. పాట్న చారిత్రిక కీర్తి, భవిష్యత్తు శతాబ్దాలుగా పరాకాష్టకు చేరుకుంది. ఇది ప్రపంచంలోని అతిపురాతన నగరాలలో ఒకటిగా ప్రత్యేకతను పొందింది, చరిత్రలో ఆధిపత్య ఉనికిని చాటుకుంది. పవిత్ర గంగానది దక్షిణ ఒడ్డు చుట్టూ పాట్న పురోగతి చెందింది.
పాట్న లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు
పర్యాటకులు వైహలి, కేసరియ, బుద్ధగయ సందర్సనతో బౌద్ధమత వాసనలతో మునుగుతారు. వైశాలి మహావీరుని జన్మస్థలంగా పేరుగాంచింది, అంతేకాకుండా ఈ ప్రదేశంలో బుద్ధుడు తన చివరి ఉపన్యాసాన్ని బోధించాడు.
వైశాలి అందమైన జపనీయుల శాంతి గోపురం, 2300 ఏళ్ళనాటి అశోక స్తంభంపై ఉన్న గొప్ప సింహపు అందాన్ని మాటల్లో చెప్పలేము. పొడవైన స్థంభాలకు ప్రసిద్ది గాంచిన కేసరియ, బుద్ధుడు అతని మరణానికి ముందు తన బిక్షపాత్రను ఇక్కడే దానం చేసాడు. గౌతమ బుద్ధుడు, బోధి చెట్టు కింద జ్ఞానాన్ని పొందిన బుద్ధగయ వద్ద ప్రపంచం మొత్తం నుండి యాత్రికులు, పర్యాటకులు చేరతారు. అసలు చెట్టు మిగిలిన మూలాలు ప్రశాంత వాతావరణంలో ఉన్నాయి, ఇక్కడ అనేకమంది యాత్రికులు ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడతారు.
అక్టోబర్ నుండి మార్చ్ నెలల సమయంలో,ఈ ప్రశాంతమైన ప్రదేశం వద్ద ప్రార్ధనలు చేయడానికి వచ్చే అనేకమంది పర్యాటకులతో ఈ ప్రదేశం రంగుల వస్త్రాలతో ఒక మహాసముద్రంగా మారుతుంది. బుద్ధగయ లో దలై లామా కొన్ని నెలలు గడిపారు. బుద్ధగయ నుండి 12 కిలోమీటర్ల దూరంలో దున్గేశ్వరి గుహ ఆలయాలు ఉన్నాయి, వీటితోపాటు పనితనానికి మంచి ఉదాహరణ అయిన హిందూ, బౌద్ధ పేరుగాంచిన మందిరాలు కూడా ఉన్నాయి.
పాట్న సంపన్న ఉదారత్వం
ఈ నగరం, ఈ నగరాన్ని సందర్శించే అనేక విదేశీ పర్యాటకులతో అభ్యాసం, కళల ప్రముఖ కేంద్రంగా ఉంది. అజాతశత్రు నుండి బ్రిటీష్ సామ్రాజ్య పాలకులు ఈ వ్యూహాత్మక నగరం ద్వారా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించారు.
పాట్న పర్యటన, రాజ్గిర్ లోని బౌద్ధ స్థలాలు, వైశాలి, కేసరియ, బోధి చెట్టు, గాంధీ సేతు, గొల్ఘర్, తఖ్త్ శ్రీ పాట్న సాహిబ్ వంటి కొన్ని అత్యంత పర్యాటక ఆకర్షణలను కలిగిఉంది. గతంలో పాట్న పచ్చిక బయళ్ళు గా పిలిచే గాంధీ మైదానం పాట్న లో ఒక కేంద్రంగా ఉంది. ఇది గొప్ప రాజకీయ, వ్యాపార వైభవాన్ని ఆస్వాదిస్తూ, చుట్టూ ప్రధాన కేంద్రంగా ఉంది.
పాట్న నగరం శతాబ్దాల కాలం నాటి గొప్ప ఉదారత్వం, మేధో పరంపర ఫలితాలను అనేకం అందిస్తుంది. పాట్న నగరం వాస్తవానికి లోతైన, భావాలను ప్రసాదించే ఇస్లాం, జైన, బౌద్ధ, హిందూ మతాల వంటి అనేక ధార్మిక బోధనల కీర్తిలో నిండి ఉంది. పాట్న ఎక్కువ ఆర్ద్రతతో, సమ-శీతోష్ణ వాతావరణంతో, వేసవిలో అధిక ఉష్ణోగ్రతను కనబరుస్తుంది.
ఈ నగరం అత్యంత వేడి వేసవిని, చేదు సీతకలన్ని పంచుకుంటుంది, ఈ ప్రాంత సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉండే కాలాలు సరైనవి. పాట్న మధువని చిత్రాలు అనికూడా పిలిచే మితిల్ల చిత్రాలకు ప్రసిద్ది చెందింది, ఇవి కర్రబొగ్గు, సుగంధ ద్రవ్యాలు, ఇతర కూరగాయల రంగులను ఉపయోగించడం ద్వారా అక్కడి స్త్రీలు సృష్టించే అసలు గ్రామీణ కళలను కలిగిఉంటాయి. పాట్న రావాలనుకునే పర్యాటకులు వివిధ ధార్మిక, చారిత్రిక కళా స్వభావాలు గల ఆధిపత్యాన్ని సూచించే అనేక ప్రాంతాలను సందర్శించడానికి ప్రణాళిక వేయవచ్చు.
పాట్న లోని ఉత్సవాలు, పండుగలు
పాట్న పర్యటన అన్ని రుచులను, ప్రాధాన్యతలను అందిస్తుంది. సోనెపూర్ మేళా నగర జీవితంలో కోరదగిన పండుగ. మౌర్య కాలంలో ఉద్భవించిన ఈ పండుగ, ఇప్పటివరకు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించబడుతుంది.
సోనెపూర్ మేళా ప్రధానంగా పశువుల ఉత్సవం, ఇది ఆసియాలోని వివిధ ప్రాంతాల నుండి సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ పండుగలో అన్ని రకాల పశువులను, జంతువులను చూడవచ్చు, అయితే అమ్మకానికి అందుబాటులో ఉండే ఏనుగులు ఈ ప్రాండుగాలోని ప్రధాన ఆకర్షణ. పాట్న పర్యటన ఒక పర్యాటకునిగా మనవ జీవితంలోని వివిధ రంగుల కలగలుపులను ఆస్వాదించడానికి అందిస్తుంది.
పాట్న చేరుకోవడం ఎలా
పాట్న పర్యటన ఈ నగరం రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా బాగా కలుపబడి ఉందని నిర్ధారిస్తుంది.