కాడ సిద్ధేశ్వర దేవాలయం సుమారు క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించబడింది. క్రిందిభాగం అయిదు దంతులు వేసి ఎత్తుగా నిర్మించారు. ఈ దేవాలయం లో శివుడు ఒక చేతిలో తన త్రిశూలాన్ని ధరించి దర్శనమిస్తాడు. పర్యాటకులు ఈ దేవాలయాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా వస్తారు.
ఈ రెండు దేవాలయాలు, విజయనగర శైలి శిల్ప సంపదను పర్యాటకులకు చూపుతాయి. ఇవి ఐ హోళే లోని హుచ్చిమల్లి గుడ్డి ని పోలి ఉంటాయి. ఈ దేవాలయం నలు చదరపు ప్రాంగణం లేదా గర్భగ్రిహం కలిగి ఒక నలుచదరపు పీఠంపై లింగం ఉంటుంది. నటరాజ మరియు పార్వతి విగ్రహాలు దర్శనమిస్తాయి. గోడలకు అందమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.
పడమటి వైపు హరి హరుడు, ఉత్తర దిశగా అర్ధనారీశ్వరుడు, దక్షిణంలో శివుడు ఉంటారు. పట్టడక్కల్ దర్శించే యాత్రికులు ఈ దేవాలయాన్ని తప్పక చూడాలి.