మల్లిఖార్జున దేవాలయం చాలా పురాతనమైనది. దీనిని 7వ శతాబ్రదంలో త్రైలోక్య మహాదేవి నిర్మించింది. ఈమె విక్రమాదిత్యుడి రెండవ రాణి. తన భర్త పల్లవులపై గెలుపు పొందిన కారణంగా ఆమె విరూపాక్ష దేవాలయం నిర్మాణం అయిన వెంటనే దీనిని నిర్మించాలని ఆదేశించింది.
ఈ కట్టడం విరూపాక్ష దేవాలయానికి పోలి ఉంటుంది. దీని నిర్మాణ శైలి ద్రవిడ శిల్ప కళా శైలి కలిగి ఉంటుంది. పట్టడకాల్ పట్టణ సందర్శకులు ఈ దేవాలయాన్ని తప్పక చూసి ఆనందించాలి. ఈ దేవాలయంలో అంతర గదులలో మరొక గుడి ఉంటుంది, ఒక సభా మండపం, గర్భగృహంతో పాటు ప్రదక్షిణలకు అనువైన మార్గం కూడా ఉంటుంది.
ప్రస్తుతం ఈ చిన్న గుడులు ఖాళీగా ఉన్నాయి. ఒకప్పుడు వాటిలో మహిషాసుర మర్దిని మరియు గణేశుడి విగ్రహాలుండేవి. సభా మండప స్తంభాలకు పురాణాలు, ఇతిహాసాలలోని ప్రధాన సంఘటనలు చెక్కబడ్డాయి.
ఈ దేవాలయంలోని నంది మండపం మరో ప్రధాన ఆకర్షణ. పురాతన కాలంనాటి శిల్ప కళా వైభవం దీనిలో కనపడుతుంది. దీని క్రిందిభాగంలో ఏనుగులు, గుర్రాలు, ఇతర జంతువుల బొమ్మలు చెక్కబడి ఉంటాయి.