పౌరీ సముద్ర మట్టానికి 1650 మీటర్ల ఎత్తులో ఉన్న సుందరమైన పర్యాటక కేంద్రం. ఇది ఉత్తరాఖండ్ లోని పౌరీ గఢ్వాల్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉన్నది. దేవదారు అడవులతో నిండి, కండోలియా పర్వతాల ఉత్తర వాలులో ఉన్న ఈ స్థలం పర్యాటకులకు మంత్రముగ్దులను చేసే దృశ్యాలను అందిస్తుంది. పర్యాటకులు, బందర్ పూంచ్, జోన్లి, గంగోత్రి సమూహం, నందాదేవి, త్రిశూల్, చౌఖంబ, ఘోరి పర్వత్, హాతి పర్వత్, స్వర్గరోహిణి, జోగిన్ సమూహం, తలయ్య-సాగర్, కేదార్నాథ్, సుమేరు మరియు నీలకంఠ వంటి మంచుతో కప్పబడిన పర్వతాల విస్తృత దృశ్యాలను చూడవచ్చు. అలకానంద మరియు నాయర్ ఈ జిల్లా లోని ప్రధాన నదులు.
ఈ ప్రాంతం వివిధ దేవాలయాలు, వీక్షణా స్థలాలు మరియు వనభోజన ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. హిమాలయ శిఖరాలు మరియు హిమానీనదాల దృశ్యాలు అందించే చౌఖంబ పర్యాటకులకు కన్నులపండుగ చేస్తుంది. ఖిర్సు సముద్ర మట్టానికి 1700 మీటర్ల ఎత్తులో ఉన్న మరొక ముఖ్య సందర్శనీయ పర్యాటక ప్రదేశం. నగర జీవిత రణగొణధ్వనులకు దూరంగా, పర్యాటకులకు ఆహ్లాదమైన పక్షుల కిలకిలారావాలు మాత్రమే వినిపించే ప్రశాంత ప్రదేశం. పౌరీ నుండి 16 కి.మీ.ల దూరంలో ఉన్న ధారి దేవి కూడా సందర్శించవచ్చు. ఇది ధారి దేవతకు అంకితం చేయబడిన పుణ్యక్షేత్రం. అదనంగా, పర్యాటకులు ఆది శంకరాచార్య నిర్మించిన మహా శివునికి అంకితం చేయబడిన పురాతన మహాదేవ్ ఆలయం కూడా సందర్శించవచ్చు.
దూధతోలి సముద్ర మట్టానికి 3100 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన పర్యాటక కేంద్రం. ఇక్కడ కండోలియా ఆలయం, సిద్ధిబలి ఆలయం, శంకర్ మఠం, కేషోరి మఠం మరియు జ్వల్ప దేవి ఆలయం వంటి అనేక సందర్శించదగ్గ మందిరాలు ఉన్నాయి. పర్యాటకులు లల్ధాంగ్, అద్వానీ, కోట్ ద్వారా, తారా కుండ్, భారత్ నగర్ మరియు శ్రీనగర్ వంటి ప్రముఖ ప్రదేశాలు కూడా సందర్శించవచ్చు. దేవల్ మరియు కంద వంటి ప్రాంతాలు కొన్ని పురాతన ఆలయాలను సందర్శించే అవకాశాన్ని అందిస్తాయి.
చేపల వేట మరియు సైక్లింగ్ పౌరీలో ప్రజాదరణ పొందిన కార్యకలాపాలు. నాయర్ నది లోని ఈతని కూడా ఆస్వాదించవచ్చు. పర్యాటకులు వాయు, రైలు మరియు రహదారి మార్గాలలో పౌరీ చేరుకోవచ్చు. 155 కి.మీ.ల దూరంలో డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం పౌరీ సమీప వైమానిక స్థావరం. పౌరీ చేరడానికి టాక్సీలు లభించే కోట్ ద్వారా సమీప రైల్వే స్టేషన్. పౌరీ, బస్సుల ద్వారా పొరుగు నగరాలు రుషికేష్, హరద్వార్, డెహ్రాడూన్ మరియు మసూరీ తో అనుసంధానించబడింది. వాతావరణం ఆహ్లదకరంగా ఉండే మార్చి నెల నుండి నవంబర్ నెల వరకు పౌరీ ప్రయాణానికి ఉత్తమ సమయం.