ఈ మ్యూజియం ఒక చిన్న గుడిసెలో కుంజాలి మర్రకార్ యోధులకు చెందినది. పయ్యోలి నుండి సుమారు 12 కి.మీ.ల దూరం ఉంటుంది. ఈ మ్యూజియంలో ఎన్నో రకాల కత్తులు, ఫిరంగి గుండ్లు, చాకులు వంటివి కనపడతాయి. ఈ మ్యూజియాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ నిర్వహిస్తోంది.
ఈ పురాతన యోధులు ముస్లిం నావికా అధికారులు. కుంజలి మర్రకార్ అనే బిరుదు వారికి ఇవ్వడమైనది. కుంజలి మర్రకార్ పదం మళయాళం నుండి వచ్చింది. వీరు కాలికట్ హిందూ రాజు వద్ద అడ్మిరల్స్ గా పనిచేసేవారు. వీరు పోర్చుగీసు వారితో పారాడి భారతీయ సముద్ర జలాలలో మొదటి నౌకాదళం ఏర్పరచారు. వీరి పుట్టుపూర్వోత్తరాలు వివాదాస్పదం.
కొంతమంది, వీరు కొచ్చి కి చెందిన నౌకా వ్యాపారులని రాజు తరపున పోర్చుగీసు వారిని పోరాడి రాజుకు బలం చేకూర్చారని, మరికొందరు వీరు ఈజిప్టు దేశం వారు కాగా అక్కడ స్ధిరపడి సామూధిరి సైన్యంలో చేరారని చెపుతారు. ఈ విధంగా మర్రకార్లు అనేక రకాల గౌరవాలను పొంది, తర్వాతికాలంలో మిగిలిన యోధులచే నావికా దళ స్ధాపనకు మార్గదర్శకులయ్యారు.