సరైన సమయం ఫిబ్రవరి, ఏప్రిల్ మాసాలు పెంచ్ సందర్శనకు ఉత్తమ సమయం. జులై నుండి సెప్టెంబర్ వరకు భారతదేశ టైగర్ రిసర్వ్ మూసి ఉంటుందని సందర్శకులు గుర్తుంచుకోవాలి. అందువల్ల పెంచ్ నేషనల్ పార్క్ దాని అందాలను అనుభవించడానికి ఫిబ్రవరి, ఏప్రిల్ మాసాలలో సందర్శించాలి.
వేసవి పెంచ్ లో ఏప్రిల్ నుండి జూన్ వరకు వేసవి సమయం. వేసవి సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత పరిధి 26 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది, వాతావరణం భరించలేనంత వేడిగా ఉంటుంది. వేసవి సమయంలో పెంచ్ సందర్శన సరైనది కాదు.
వర్షాకాలం పెంచ్ లో వర్షాకాలం జులై నుండి ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. పర్యాటకులు ఈ సమయంలో నైరుతీ ఋతుపవనాల వల్ల భారీ వర్షపాతాన్ని అనుభవిస్తారు. సంవత్సరంలో ఈ సమయంలో భారీ వర్షాల వల్ల దృశ్య వీక్షణ ఆటంకంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పెంచ్ సందర్శన మంచిది కాదు.
శీతాకాలం పెంచ్ లో నవంబర్, ఫిబ్రవరి మధ్యలో చలి వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత దాదాపు గడ్డకట్టే స్థాయికి తగ్గితే, గరిష్ట ఉష్ణోగ్రత షుమారు 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ సమయంలో పెంచ్ సందర్శించేవారు, ఉలెన్ దుస్తులను తీసుకువెళ్ళడం మంచిది.