పేరెన్ లోని పుఇల్వా గ్రామం వద్ద కల గుహలు నాగా ల్యాండ్ ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలవి. వీటిని వారు బాగా ప్రేమిస్తారు. పేరెన్ టవున్ కి ఇవి సుమారు 30 కి.మీ.ల దూరంలో కలవు. ఈ గుహలలో, బ్రిటిష్ పాలనలో వారి విప్లవ రాణి గైదినిల్లు దాగుకొని ఆశ్రయం తీసుకుంది. అప్పటి నుండి ఈ ప్రదేశం నాగా ప్రజలకు ఒక చారిత్రక మరియు ఇతిహాస ప్రదేశంగా మారింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నాగాల నాయకుడైన ఏ జద్ ఫిజో నాగాలా గుర్తింపు కొరకు ఈ గుహల నుండే పోరాటం చేసాడు.
ఈ గ్రామంలో గుహలు అనేకం కలవు. కనుక సాహస పర్యాటకులు వీటిని సందర్శించి ఆనందించవచ్చు. మీరు రోజంతా ఈ గుహలలో ఒక దాని తర్వాత ఒకటి చూసి వాటి అందాలను ఆస్వాదించవచ్చు. పుఇల్వా గ్రామ ప్రజలు స్నేహ పూరితులు. వారితో కలసి వారి జీవన స్థితి, సంస్కృతి ల ను కూడా తెలుసుకోవచ్చు.