భారత దేశంలో భూదానోద్యమానికి ఆద్యుడు వినోభా భావే కి అంకితం చేయబడిన ఆశ్రమం ఈ వినోభా మందిరం. నేడు ఇది ధార్మిక దృష్టికోణంలో ప్రాముఖ్యత పొంది ఆలయంగా పరిగణించబడుతుంది. చారిత్రక భూదానోద్యమానికి నాందీ ప్రదేశంగా పోచంపల్లి ప్రజలలో ఈ ఆలయం విపరీతమైన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆలయంలో ఆచార్య వినోభా భావే, పేదలకి భూమి పంచిన మొదటి వ్యక్తి అయినటువంటి శ్రీ వెద్రే రామచంద్ర రెడ్డిల విగ్రహాలు ఉన్నాయి. అతను ఉదారంగా 250 ఎకరాల భూమి పోచంపల్లి ప్రజలకి దానం చేసాడు. ఈ ఆలయంలో ప్రదర్శించబడుతున్న ఆచార్య వినోభా భావే జ్ఞాపకాలను కూడా యాత్రికులు వీక్షించవచ్చు.
ఆలయం బయట భూదాన స్తూపం, దేశంలోని కొత్త శకానికి నాంది పలికిన ఉద్యమానికి స్మారక చిహ్నంగా నిలుస్తుంది.